తెలుగు, తమిళ సినిమాల్లో దూసుకుపోతున్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. తన అందంతో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది.. కన్నడ కిర్రిక్ పార్టీతో వెండి తెరకై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో ‘ఛలో’ అంటూ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.. ఈ అమ్మడి నటనకు క్లాస్, మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.. స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారింది..
‘గీత గోవిందం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది..ఇటీవల రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా ఫుల్ ఫేమస్ అయ్యింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరు పిల్లలా రష్మిక స్పెష్ల అప్పీయరెన్స్ ఇచ్చింది.
ఇక రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. తన ఈవెంట్స్ కి సంబంధించిన ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటారు. ICW2022 ఫ్యాషన్ వీక్ లో రెడ్ ఎత్నిక్ ఎంసెట్ లో రష్మిక మెరిసింది. ఈ నేపథ్యంలో రష్మిక తన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఈ క్యూట్ బ్యూటీ ఎంతో హాట్ గా కనిపిస్తోంది. అంతేకాదు ఈ ఫోస్ట్ లో రష్మిక అన అభిమానులకు ఓ సవాల్ విసిరింది. ‘ఎవరు ముందుగా రెప్ప వేస్తారో.. వారు ఓడిపోతారు’ అని క్యాప్షన్ లో రాసుకొచ్చింది. ఈ ఫొటోల్లో రష్మిక తెల్లటి హాల్టర్నెక్ టాప్ లో డెనిమ్ జాకెట్ లో అందంగా కనిపిస్తోంది. ఆ పోస్ట్ చేసిన వెంటనే ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తన అభిమానులు అయితే కామెంట్స్ సెక్షన్ నింపేస్తున్నారు. డామ్ క్యూగ్.. క్యూట్ నెస్ లో మిమ్మల్ని ఎవరూ బీట్ చేయలేరు’, ‘వెరీ హాట్’, మైండ్ బ్లాక్ అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం రష్మిక మందన్న ప్రస్తుతం ‘మిషన్ మజ్ను, గుడ్ బై, తలపతి 66 సినిమాల్లో నటిస్తోంది.