Sarkaru vari pata : సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కొంత టాకీ పార్ట్ ఫినిష్ చేశాడు. ఇది ఆయన కెరీర్ లో 27వ సినిమా కావడంతో భారీ స్థాయిలో తయారవుతోంది. పరశురాం సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూకుడు మీదున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. దుబాయ్ లో ఓ నెల రోజుల పాటు భారీ యాక్షన్ సీన్లు, ఛేజింగ్ సీన్లతో పాటు కీర్తి సురేష్ హీరో మహేష్ బాబు మీద కొన్ని ముఖ్యమైన సీన్స్ తెరకెక్కించారు.
ఆ తర్వాత రెండు చోట్ల షెడ్యూల్ అనుకున్నారు. ఒకటి ఫారిన్ షెడ్యూల్..మరికటి గోవా షెడ్యూల్. గోవాలో కేవలం ఒక పాటను మాత్రమే ప్లాన్ చేశారట. అమెరికాలో కొన్నాళ్ళు షెడ్యూల్ ప్లాన్ చేసి విరమించుకున్నారు. కరోనా ప్రభావం..అన్నీ చోట్ల ఊహించని తీవ్రతతో ఉండటంతో ఇటు గోవా షెడ్యూల్ అటు ఫారిన్ షెడ్యూల్ నిలిపివేశారు. మళ్ళీ కూడా వీలైతే దూబాయ్ లొకేషన్స్ లో సర్కార్ వారి పాటి చిత్రీకరణకి మేకర్స్ ..మహేష్ ని సంప్రదించగా ఒకే అన్నాడు. కానీ అక్కడ కూడా ప్రస్తుతం పరిస్థితులన్నీ అదుపులో లేవు.
Sarkaru vari pata : సర్కారు వారి పాట షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్..?
అందుకే ఇక లాభం లేదనుకొని హైదరాబాద్ చుట్టుప్రక్కల కొన్నాళ్ళు, సింగిల్ షెడ్యూల్ చేయాలనుకున్నారు. ఆమేరకు షూటింగ్ కూడా ప్రారంభించారు. కానీ కొందరు సర్కారు వారి పాట యూనిట్ సభ్యులను కరోనా వదల్లేదు. ఈ కారణంగా ఇక్కడ కూడా షూటింగ్ ఆపి అందరూ ఇళ్ళలో ఉన్నారు. అయితే ఇప్పుడు మహేష్ పర్ఫెక్ట్ ప్లాన్ వేసి టీకాలు వేయించారట. ఎవరికీ కరోనాతో ఇబ్బంది ఉండదనే నమ్మకం కలిగి సర్కారు వారి పాట షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేసే ఆలోచనకి వచ్చారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. చూడాలి అది ఎన్ని రోజుల్లో జరుగుతుందో.