తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు స్టార్ హీరోగా కొనసాగుతూ, మరొవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటిస్తున్నాడు. అతని నటనతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. విజయ్ సేతుపతి ఇప్పటి వరకు 50 చిత్రాల్లో నటించాడు.. 2019లో వచ్చిన సైనా నరసింహారెడ్డి సినిమాతో తెలుగులో అడుగుపెట్టాడు. ఇక 2021లో ఉప్పెన సినిమాతో ఆయన నటనకు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకున్నాడు..బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ లో విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రానుంది. ఈ చిత్రానికి విజయ్ సేతుపతి 21 కోట్లు వసూలు చేసినట్లు టాక్.. అదే సమయంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా కోసం విజయ్ భారీగా వసూలు చేస్తున్నాడట.. పుష్ప2లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నారు.
భాష ఏదైనా, పాత్ర ఏదైనా నటుడిగా ప్రేక్షకులను మెప్పించగల నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు మంచి స్పందన వచ్చింది. సంతానం పాత్రలో విజయ్ సేతుపతి జీవించేశాడు..ఇంతకు ముందు విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ రూ.15 కోట్లు ఉండేది.. కానీ విక్రమ్ సినిమాలో ఆయన పాత్రకు వచ్చిన క్రేజ్ తో తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడు.
షారూక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలో విలన్ పాత్ర కోసం ఏకంగా 21 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.. అంతేకాదు.. జవాన్ సినిమా కోసం అప్పటికే లైన్ లో ఉన్న రెండు సినిమాలను కూడా విజయ్ వదిలేసుకున్నట్లు సమాచారం. దీంతో జవాన్ నిర్మాతలు అతడికి అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఇదే నిజమైతే ఇండియాలోనూ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విలన్ గా విజయ్ సేతుపతి నిలుస్తాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో విడుదల కానుంది.