NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

3 రాజధానుల బిల్లు కోసం సుప్రీం మెట్లు ఎక్కబోతున్న జగన్ మోహన్ రెడ్డి ?? 

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల విష‌యంలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎన్ని స‌వాళ్లు ఎదురైన ముందుకు సాగాల‌నే ఉద్దేశంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లు విషయలో ఏపీ ప్రభుత్వాన్ని విప‌క్షాలు కూడా ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నాయి.

ఇదే స‌మ‌యంలో రాజధాని రైతుల నుంచి సైతం ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది. మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా బిల్లులపై హైకోర్డు ఈ స్టే విధించింది. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకొని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతోంది.

రాజ‌ధాని విష‌యంలో హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన సంద‌ర్భంగా మూడు రాజధానుల బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్డు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల గడువు కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది. మ‌రోవైపు, హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిష‌న్‌ విచారణకు రాకపోవడంతో అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. త‌ద్వారా సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధ‌మైంది.

ఇదిలాఉండ‌గా, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌న్నిహితుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి రాజ‌ధాని విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2014 ఎన్నికలకు ముందు అమరావతిలో రాజధాని పెడతానని మేనిఫెస్టోలో చంద్రబాబు పెట్టారా ? అని సజ్జల ప్రశ్నించారు. మూడు రాజధానులపై గందరగోళం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ప్రజలను రెచ్చగొట్టి వారితో రాజధాని వద్దని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కర్నూలు, వైజాగ్ ప్రజలు తమకు రాజధాని వద్దని ప్రజలు అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

శివరామ కృష్ణన్ కమిటీ కూడా అమరావతిలో రాజధాని పెట్టమని చెప్పలేదని స‌జ్జ‌ల స్ప‌ష్టం చేశారు. అమరావతిలో రాజధాని పెట్టమని నారాయణ కమిటీ మాత్రమే చెప్పిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అమరావతి రాజధానిగా పెట్టారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు తన పాలనలో అమరావతి పూర్తి చేయకుండా ఏ గుడ్డి గుఱ్ఱనికి పళ్ళు తోముతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన తాబేదార్లుకు అమరావతి కామధేనువు వంటిదని స‌జ్జ‌ల ఆరోపించారు.

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాల వికేంద్రీకరణ అని మేనిఫెస్టోలో పెట్టారని స‌జ్జ‌ల స్ప‌ష్టం చేశారు. ఏడాది పాటు మూడు రాజధానులపై కసరత్తు జరిగిందన్న అయన మూడు రాజధానులపై చంద్రబాబే ప్రజాభిప్రాయం కోరాలని అన్నారు. చంద్రబాబు 48 గంటలకు ఒక సారి మీడియా సమావేశం పెట్టి అసందర్భ ప్రేలాపణలు పేలుతున్నారని మండిప‌డ్డారు.

author avatar
sridhar

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju