NewsOrbit
న్యూస్

ఆ పోస్టు మాకు వద్దే వద్దు సార్ ! చంద్రబాబు, జగన్ లకు ముఖం మీదే చెప్పేస్తున్న నాయకులు!!

ఎంపీ అంటే ఏడుగురు ఎమ్మెల్యేల పైన ఉండే వాడు. కాబట్టి సహజంగానే అతనికి సీన్ ఎక్కువ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఏపీలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉందట.

 We do not want that post sir! Leaders who say your face to Chandrababu and Jagan
We do not want that post sir! Leaders who say your face to Chandrababu and Jagan

ఎమ్మెల్యేలను పట్టించుకునే ఎమ్మెల్యేలు ఎవరూలేరు అట!2014 నుంచి ఎంపీలకు ఇలాంటి దుస్థితి ఎదురవుతోందని చెప్పవచ్చు.అంటే అప్పుడు టిడిపి హయాంలోనైనా, ఇప్పుడు వైసీపీ జమానాలో నైనా ఎంపీలు చెల్లని కాసులుగా మిగిలిపోతున్నారని అర్థం.దీనికి కారణం ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు కావడమే అంటున్నారు.జాతీయ పార్టీ ఎంపీల కైతే ఢిల్లీ స్థాయిలో పరపతి ఉంటుంది.వారు పార్టీ హైకమాండుకు దగ్గరగా ఉంటారు.ప్రాంతీయ పార్టీ విషయాలు విషయానికొచ్చేసరికి ఆయా పార్టీలు ఎమ్మెల్యేలను ఎక్కువగా పట్టించుకుంటాయి.ఎంపీలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు.2004, 2009ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు ఎక్కువగా గెలిచారు.

అయితే అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లో ఉండడంతో ఎంపీలకు ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇచ్చేవారు.అందువల్ల ఎంపీలు హ్యాపీగా ఉండేవారు.ఎమ్మెల్యేలు కూడా ఎంపీలను తమ నియోజకవర్గాలకు తీసుకెళ్లి తమ పనులు చేయించుకునేవారు.2014 ఎన్నికల్లో టిడిపి ఎంపీలు ఎక్కువగా గెలిచారు .రాష్ట్రంలో కూడా టిడిపి అధికారంలోకొచ్చింది.2014 నుంచి ఏపీలో ఎంపీల పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా ఇబ్బంది పడేవారు. తమ నియోజకవర్గాల్లో వేలు పడితే ఒప్పుకునే వారు కారు. కనీసం తమ నియోజకవర్గాల్లో పర్యటించమని కోరడం కూడా జరిగేది కాదు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటేనే తప్ప వేదికలపై ఎంపీలకు చోటు ఉండేది కాదు. ఎంపీ ల్యాడ్స్ ను కూడా ఎమ్మెల్యేలు లైట్ గా తీసుకున్నారు. కేశినేని నాని, మురళీ మోహన్, శివప్రసాద్ వంటి ఎంపీలు అప్పట్లో ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో చంద్రబాబుకు అనేకమంది ఎంపీలు వ్యక్తిగతంగా కలసి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పేమీ రాలేదు.2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు 22 మంది ,ఎమ్మెల్యేలు 151 మంది గెలిచారు.ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయిందంటే ఎంపీలను లెక్కచేసే ఎమ్మెల్యేలు లేకపోగా వారిని ఇబ్బంది పెడుతున్న వైసీపీ శాసన సభ్యులు ఎక్కువగా ఉన్నారు.

ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలిగే బాపట్ల ఎంపి నందిగామ సురేష్ బాబు లాంటి వారిని మినహాయిస్తే ఎక్కువ మంది ఎంపీలు అసంతృప్తిగానే ఉన్నారు.జగన్ విషయానికొస్తే ఆయన ఎమ్మెల్యేలు కూడా పెద్ద సీన్ ఇవ్వకపోయినా ఎంపీలను అసలు గుర్తించడం లేదంటారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా పనిచేసి వైసీపీలో కొచ్చి గెలిచిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ,బాలసౌరి వంటి వారు ఈ తేడాను స్పష్టంగా గమనిస్తున్నారు.మరికొందరు ఎంపీలు తమ గోడును బయటపెడుతునా జగనేమీ పట్టించుకోవడం లేదనే సమాచారం ఉంది.దీంతో ఎమ్మెల్యే పదవి బెస్టు ఎంపీలు వేస్ట్ అని వారు వాపోతున్నారు

author avatar
Yandamuri

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju