Breaking: వింబుల్డన్ 2022 (Wimbledon 2022) లో భారత టెన్నీస్ స్టార్ (Tennis Star) సానియా మీర్జా (Saniya Mirza) సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంగా క్రోయోషియాకు చెందిన పార్టనర్ మేట్ పావిచ్ తో జత కట్టిన సానియా మీర్జా సెమీ ఫైనల్స్ కు దూసుకువెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ఆరో సీడ్ సానియా – పావిచ్ జోడీ ఒక గంట 41 నిమిషాల్లో 6-4, 3-6, 7-5 స్కోర్ తో నాలుగో సీడ్ గాబ్రియెల డబ్రోస్కీ (కెనడా) – జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) ధ్వయంపై అధ్బుత విజయం సాధించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్ లు సంధించడంతో పాటు పవర్ ఫుల్ ఫోర్స్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సానియా – పావిచ్ జోడీ సెమిస్ లో రెండో సీడ్ డెసీరే క్రాజిక్ – నీల్ స్కుప్స్కీ..ఏడో సీడ్ జెలీనా ఓస్టాపెండో – రాబర్ట్ ఫరా జోడీల మధ్య పోటీలో విజేతను ఎదుర్కోనున్నది. కాగా తన కేరీర్ లో చివరి వింబుల్డన్ ఆడుతున్న సానియా .. మిక్స్డ్ డబుల్ విభాగంలో తొలి సారి సెమీస్ లోకి ప్రవేశించడంతో కేరీర్ ను ముగించాలని భావిస్తొంది.