ఈ టోర్నీలో యువ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ ఫామ్ కొనసాగించింది. ఐపీఎల్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఢిల్లీ అప్పుడే నాలుగో విజయాన్ని కూడా నమోదు చేసి టేబుల్ టాపర్ గా నిలిచింది. ఈ సీజన్ లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ముందు టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 195 పరుగులు చేయగలిగింది.
దిల్లీ ఓపెనర్స్ తొలి వికెట్కు 68 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. పృథ్వి షా, శికర్ ధ్గావన్ చాలా దూకుడుగా స్కోరు బోర్డుని పరుగులెత్తించారు. వికెట్ పడకుండా 60 కి పై పవర్ ప్లే లో స్కోర్ చేశారు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వీరి జంటను విడదీసిన తరువాత అయ్యర్, ధావన్ వెంటవెంటనే వికెట్లు ఇచ్చేశారు. దోంతో ఢిల్లీ ఒక మాదిరి స్కోర్ కి పరిమితం అవుతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టాయినిస్ వచ్చి మ్యాచ్ స్వరూపం మార్చేశాడు.
అసలు ఎటువంటి కంగారు లేకుండా మొదటి నుండి బెంగుళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 53 పరుగులతో అజేయంగా నిలిచిన స్టాయినిస్ కు పంత్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. దాంతో చివరికి ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆతర్వాత ఏ దశలో కూడా బెంగళూరు బ్యాట్స్మెన్ ఈ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఓపెనర్లు పడిక్కల్, ఫించ్ తో పాటు ప్రపంచ మేటీ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ పవర్ ప్లే లోనే వికెట్లు ఇచ్చేశారు.
మొదటి ఆరు ఓవర్లలో బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 43 పరుగు చేయడం విశేషం. కోహ్లీ ఒక ఎండ్ లో వికెట్లు నిలబెట్టి ఉన్నా కూడా అతనికి సహకారం అందించే వారు కరువయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ బెస్ట్ బౌలర్ బౌలింగ్ రబాడ బౌలింగ్ లో కోహ్లీ కూడా వెనుదిరిగాడు. పూర్తి 20 ఓవర్లు ఆడిన ఆర్సీబీ జట్టు 137 పరుగులు చేసి 59 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవి చూసింది.