యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఫ్యాన్స్ని ఖుషీ చేసే గుడ్న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కృతి శెట్టి ప్రస్తుతం కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. గత నెలలో `ది వారియర్`తో ప్రేక్షకులను పలకరించిన కృతి.. ఈ నెలలో `మాచర్ల నియోజవర్గం`తో అలరించేందుకు సిద్ధం అవుతోంది.
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. నితిన్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ విడుదలైన నెల రోజులకే మరో సినిమాతో సందడి చేసేందుకు కృతి శెట్టి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్లో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఒకటి.
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను బెంచ్మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి నిర్మించారు. అయితే ఈ సినిమా రాకకు రంగం సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా బయటకు వదిలారు. ఈ మూవీ వచ్చే నెల అంటే సెప్టెంబర్ 16వ తేదీని అట్టహాసంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటనతో స్పష్టమైంది. ఇక త్వరలోనే ప్రచార కార్యక్రమాలను కూడా షురూ చేయబోతున్నారు.
https://www.instagram.com/p/ChEU_cth6P_/?utm_source=ig_web_copy_link