చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ హిట్లను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. `ఎఫ్2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో సూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్.. `గని` మూవీతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచినా, మళ్లీ వెంటనే `ఎఫ్3` మూవీ తో సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది సెట్స్ మీద ఉండగానే వరుణ్ తేజ్ మరో సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చింది. రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వరుణ్ తేజ్ ఓ చిన్న వీడియో ద్వారా ప్రకటించాడు.
ఈ సినిమాకు దర్శకుడు ఎవరు..? అన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ నెల 19న అన్ని వివరాలు బయటకు రానున్నాయని వరుణ్ తెలిపాడు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు.
ఇంతకుముందు అతడితో వరుణ్ తేజ్ `అంతరిక్షం` అనే మూవీ చేశాడు. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్గాకే వరుణ్ తేజ్ మరో ఛాన్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుండటంతో.. నెటిజన్లు రిస్క్ అవసరమా అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CimHLPCpX8B/?utm_source=ig_web_copy_link