`ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఎప్పుడో ఈ మూవీ పట్టాలెక్కాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటించబోతోందట.
ఆమె మరెవరో కాదు.. లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి. ఎన్టీఆర్ కు అత్తగా విజయశాంతి కనిపించబోతోందని, ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఈ పాత్రకు సంబంధించి ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందని కూడా టాక్ నడుస్తోంది.
కాగా, చాలా ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విజయశాంతి.. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు `ఎన్టీఆర్ 30`లో నటించేందుకు విజయశాంతి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో చూడాలి.