మాస్ మహారాజ్ రవితేజ నుండి రాబోతున్న తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. ఇందులో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ మాస్ ఎంటర్టైనర్తో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా కనిపించనున్నాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సెన్సార్ ను కూడా కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ ను దక్కించుకున్న ఈ మూవీకి.. రిలీజ్కు ఒక్కరోజు ముందు ఊహించని షాక్ ఇచ్చారు.
ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో రవితేజ చెబుతున్న డైలాగ్ వీడియోను కొందరు లీకుల వీరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండటంతో.. చిత్ర టీమ్ మైండ్ బ్లాక్ అయింది. మరోవైపు రవితేజ సైతం ఈ విషయంపై ఫైర్ అయ్యారట. వీడియోను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని సూచించారట.
ఇకపోతే లీకైన బిట్లో ప్రతి నాయకులకు.. `రేయ్ మీరు ఎవరో ఏ పార్టీ నో నాకు అనవసరం, ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని, కొండలు తవ్వేస్తాం, చెరువులు పూడ్చేస్తాం, అడ్డంగా భూములు కొట్టేద్దాం అని దౌర్జన్యం చేయాలని చూస్తే, తాట తీస్తా` అంటూ ఫుల్ ఎనర్జీతో రవితేజ డైలాగ్ చెబుతుండటం మనం గమనించవచ్చు.
#RamaRaoOnDuty : This Leaked Bit has started circulating in social media!#RamaRaoOnDutyFromJuly29th pic.twitter.com/HDfissMVWQ
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 28, 2022