టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ `కార్తికేయ 2` మూవీతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తే.. అనుపమ్ ఖేర్, తులసి, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
2014లో విడుదలైన `కార్తికేయ`కు సీక్వెల్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. అనేక అడ్డంకులను దాటుకుని చివరాఖరకు ఆగస్టు 13న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోగా గ్రాండ్ గా విడుదలైంది. అయితే అనూహ్యంగా అన్ని భాషల్లోనూ ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుని.. అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది.
విడుదలైన ఇరవై రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ చిత్రంతో తాజాగా నిఖిల్ నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. హిందీ డబ్బింగ్ వెర్షన్స్ లో ఈ సినిమా టాప్ 10 కలెక్షన్స్ లో చోటు దక్కించుకుంది. అది కూడా ఫుల్ రన్ ఇంకా పూర్తి కాకముందే.
రూ.28 కోట్లు కలెక్షన్స్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమా 10వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు దాన్ని దాటుకుని రూ. 29 కోట్లు వసూళ్లతో నిఖిల్ నటించిన `కార్తికేయ 2` 9వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ప్రభాస్ `రాధేశ్యామ్` సినిమా రూ.19 కోట్ల 30 లక్షలతో 13వ ర్యాంక్ లోనే ఆగిపోయింది. ఈ లెక్కడ నిఖిల్.. ప్రభాస్, రజినీకాంత్లను కూడా మించిపోయాడనే చెప్పాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!