కృతి శెట్టి.. ఇటీవల కాలంలో ఈ యంగ్ బ్యూటీ పేరు ఎంతలా మారుమోగిపోతోందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన `ఉప్పెన` మూవీతో టాలీవుడ్లోకి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కృతి శెట్టిని మంచి క్రేజ్ ఏర్పడటమే కాదు.. వరుస అవకాశాలు కూడా తలుపు తట్టారు.
ఆ తర్వాత ఆమె నుండి వచ్చిన `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో.. గోల్డెన్ లెగ్ అంటూ కృతి శెట్టిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే రీసెంట్గా ఈ బ్యూటీ `ది వారియర్`తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో.. కృతి తొలి ఫ్లాప్ను మూటగట్టుకుంది.
అయితే త్వరలోనే విడుదల కాబోయే `మాచర్ల నియోజవర్గం`తో ఈ ఫ్లాప్ నుండి బయట పడాలని ఆమె ఆశిస్తోంది. నితిన్ హీరోగా ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి.. ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. అలాగే తన మనసు బాలేనప్పుడు చేసే చిలిపి పనేంటో కూడా తెలిపింది. తన మనసు బాగోలేనప్పుడు మొట్ట మొదట ఐస్క్రీమ్ తింటానని, ఐస్క్రీమ్ తింటే తన మూడు ఇట్టే మారిపోతుందని చెప్పుకొచ్చింది. అలాగే తనకు స్వీట్స్ అన్నా కూడా ఎంతో ఇష్టమని వివరించింది.