సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ హాస్పిటల్ పాలయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. విపరీతమైన వెన్నుముక నొప్పి సమస్యతో బాధపడుతున్న ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు.
`వెన్నుముక నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. రెండు రోజులు విశ్రాంతి అవసరం. కోలుకున్నాక మళ్ళీ వీధుల్లో యధావిధిగా పాల్గొంటాను` అంటూ నటి ఖుష్బూ ట్వీట్ చేశారు. అలాగే హాస్పిటల్లో బెడ్పై దిగిన ఓ ఫోటోను సైతం షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. మీరు త్వరగా కోలుకుని రావాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
కాగా, బాల నటిగా సినీ రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు చక్రం తిప్పిన ఖుష్బూ.. టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
ప్రస్తుతం సహాయక పాత్రను పోషిస్తూ కెరీర్ను కొనసాగిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటిస్తున్న `వారసుడు` సినిమాతో సహా పలు చిత్రాలు చేస్తున్న ఖుష్బూ.. మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతోంది. మరోవైపు రాజకీయాల్లో సైతం చురుగ్గా ఉంటున్నారు.
https://twitter.com/khushsundar/status/1577612480750108672?s=20&t=95y14dQTOANFiqtPgfW04g