సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మీనా.. ప్రస్తుతం సహాయక పాత్రలు పోషిస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. అంతా సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
ఆమె భర్త విద్యాసాగర్ ఇటీవల కనుమూశారు. లాంగ్స్ సమస్యతో బాధపడుతూ జూన్ 29న విద్యాసాగర్ మృతి చెందారు. ఆయన మరణంతో తీవ్ర శోకంలో మునిగిపోయిన మీనా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మళ్లీ సినిమాలపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ తో అభిమానులను అలరిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మీనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ను ఉద్దేశిస్తూ ఓ సంచలన పోస్ట్ పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `పొన్నియిన్ సెల్వన్` పార్ట్ 1 రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలను పోషించారు.
సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే మీనా తాజాగా ఈ సినిమాను మెచ్చుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. `నాకు అసూయగా ఉంది. నా జీవితంలో మొదటిసారి ఐశ్వర్యారాయ్ ను చూసి అసూయ పడుతున్నాను. ఎందుకంటే ఆమె నా డ్రీమ్ రోల్ అయిన నందిని పాత్రను పీఎస్-1లో (పొన్నియిన్ సెల్వన్) పోషించింది. ఈ చిత్రం కోసం వర్క్ చేసిన నటీనటులు మరియు సిబ్బందికి అభినందనలు` అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో మీనా పోస్ట్ కాస్త వైరల్గా మారింది.
https://www.instagram.com/p/CjFjyQtvTKz/?utm_source=ig_web_copy_link
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!