పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. టి. సిరీస్ బ్యానర్పై భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ కలిసి నిర్మిస్తున్నారు.
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా అలరించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. 3డీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఇందులో భాగంగానే మేకర్స్ ప్రమోషన్స్ సైతం షురూ చేశారు. అయితే ఇలాంటి తరుణంలో.. `ఆదిపురుష్` సినిమా విడుదల వాయిదా పడనుందంటూ ఓ వార్త జోరుగా నెట్టింట వైరల్ అవుతోంది. వచ్చే సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`, నందమూరి బాలకృష్ణ `వీరసింహారెడ్డి`, అఖిల్ అక్కినేని చేస్తున్న `ఏజెంట్` చిత్రాలు విడుదల కాబోతున్నాయని కన్ఫామ్ అయింది.
దీంతో `ఆదిపురుష్` వాయిదా పడనుందని, అందుకే ఆయా సినిమాలన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రచారంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి బరిలో ఎంత మంది ఉన్నా `ఆదిపురుష్` రిలీజ్ డేట్ మారదని.. ముందు ప్రకటించినట్టుగానే జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!