పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `ఆదిపురుష్` ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టి. సిరీస్ బ్యానర్పై భూషణ్కుమార్, క్రిషన్కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ సంయుక్తంగా హై బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్లు అలరించబోతున్నారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, హేమా మాలిని తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ ఎత్తున విడుదల కానుంది.
ఇకపోతే షూటింగ్ పూర్తైనా.. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా ఇప్పటి వరకు బయటకు వదల్లేదు. ఈ విషయంలో మేకర్స్పై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్కు ఖుషీ చేసే గుడ్న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. `ఆదిపురుష్` టీజర్ కు మేకర్స్ ముహూర్తం పెట్టేశారట.
నవరాత్రి మొదటిరోజు నుంచి అయిన సెప్టెంబర్ 26న `ఆదిపురుష్` టీజర్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టీజర్ విడుదలతోనే ప్రమోషన్స్ కూడా షురూ చేయబోతున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.