Adipurush: గత ఏడాది దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “RRR” ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని మరింతగా పెంచింది. ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా గెలవడం తెలిసిందే. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా తెలుగులో కూడా భారీ బిజినెస్ చేయడం జరిగింది. బాహుబలి వంటి అంతర్జాతీయ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత రాజమౌళి తీసిన సినిమా “RRR” థియేట్రీకల్ బిజినెస్ పరంగా చూసుకుంటే ₹191 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉంది.
అయితే ఈ పరంగా ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా “ఆదిపురుష్” ₹170 కోట్ల రూపాయలు థియేట్రీకల్ బిజినెస్ చేసి రెండో స్థానంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. జూన్ 16వ తారీకు ఈ సినిమా విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున బిజినెస్ జరగటంతో… ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన.. బజార్లకు మంచి లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. రామాయణం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు.రాముడి పాత్రలో ప్రభాస్ సీత పాత్రలో కృతి సనన్ నటించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు సినిమాపై ఎంతో హైప్ అంతకంతకు పెంచేయడం జరిగింది. సో తెలుగు రాష్ట్రాల బిజినెస్ భారీ ధరకు అమ్మినట్లు తాజా లెక్కలు బట్టి తెలుస్తోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ … “ఆదిపురుష్”తో నైనా హిట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.