Akhil Akkineni: అక్కినేని మూడో తరం, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వి. వి. వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `అఖిల్` చిత్రంతో హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అఖిల్.. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు చేశాడు. కానీ, అనూహ్యంగా ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
దాంతో హిట్ కోసం పరితపించిపోయిన అఖిల్.. ఎట్టకేలకు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` అనే మూవీ చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురెందర్ 2 సినిమాస్ బ్యానర్లపై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో ముంబై మోడల్ సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుంటే.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ, అప్పటికింకా చాలా పనులు పెండింగ్ లో ఉండనున్న నేపథ్యంలో.. రిలీజ్ డేట్ను అక్టోబర్ మొదటి వారానికి పోస్ట్ పోన్ చేయబోతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి.
అయితే ఇక్కడో పెద్ద చిక్కుంది. అక్టోబర్లో మెగాస్టార్ చిరంజీవి నటింస్తున్న `గాడ్ ఫాదర్`, నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రూపుదిద్దుకుంటున్న `ఎన్బీకే 107` చిత్రాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలకు అఖిల్ ఎదురెళ్లి తట్టుకోగలడా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!