అక్కినేని నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. వరసగా మూడు ఫ్లాపులు పడిన తర్వాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం ఈయన `ఏజెంట్` అనే మూవీ చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది.
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురెందర్ 2 సినిమాస్ బ్యానర్లపై రాంబ్రహ్మం సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈలోపే అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టాడట.
వేణు శ్రీరామ్.. ఈ పేరు గుర్తుండే ఉంటుంది. గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో `వకీల్ సాబ్`ను తెరకెక్కించి హిట్ అందుకున్న డైరెక్టరీయన. అయితే వేణు శ్రీరామ్ ఎప్పటి నుంచో అల్లు అర్జున్ హీరోగా `ఐకాన్` అనే టైటిల్ తో ఓ మూవీ చేయాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ను రెండు, మూడు సార్లు అనౌన్స్ కూడా చేశారు.
కానీ, బన్నీ ఈ సినిమాను చేసేందుకు ఏ మాత్రం ఇంట్రస్ట్ చూపడం లేదు. మొదటి నుంచీ ఈ మూవీని వద్దనుకుంటూనే ఉన్నాడు. ఇక పుష్ప కారణంగా బన్నీ ఇప్పట్లో `ఐకాన్` కోసం డేట్స్ కూడా ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో.. వేణు శ్రీరామ్ వెయిట్ చేయలేక అఖిల్ను లైన్లో పెట్టాడట. వీరి కాంబో ప్రాజెక్ట్ను దిల్ రాజు నిర్మించనున్నారట. దీంతో బన్నీ వద్దనుకున్న `ఐకాన్` కథతోనే అఖిల్ సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి `ఐకాన్` కథతోనే అఖిల్ సినిమా చేస్తున్నాడా..? లేక వేణు శ్రీరామ్ మరో కొత్త కథను అఖిల్కు నెరేట్ చేశాడా..? అన్నది తెలియాల్సి ఉంది.