టాలీవుడ్ కి ఈ జూలై నెల అస్సలు కలిసిరాలేదు. 2022 స్టార్ట్ అయ్యాక జనవరి నుంచి జూన్ వరకు ప్రతి నెల కనీసం ఒక హిట్ సినిమా అయినా టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి నిర్మాతలకు, బయ్యలకు లాభాలను తెచ్చాయి. కానీ, జూలై నెలలో ఒక్కటంటే ఒక్క హిట్ మూవీ కూడా పడలేదు.
రిలీజైన ప్రతీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి ఇటు ప్రేక్షకులను, ఇటు తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా నిరాశ పరిచాయి. అసలింతకీ జూలైలో వచ్చిన సినిమాలను ఓ సారి పరిశీలిస్తే.. జూలై 1న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన `పక్కా కమర్షియల్` వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫయం అయింది.
జూలై 8న లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న `హ్యాపీ బర్త్డే` వచ్చి డిజాస్టర్ అయింది. జూలై 14న టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, కృతి శెట్టి జంటగా నటించిన `ది వారియర్` వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత రోజు అంటే జూలై 15న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేసిన లేడీ ఓరియెంట్ మూవీ `గార్గి` విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
ఇక జూలై 22న నాగచైతన్య నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ `థ్యాంక్యూ`, జూలై 29న మాస్ మహారాజ్ రవితేజ చేసిన `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలు విడుదల అయ్యాయి. వీటి ఫలితాలేంటో తెలిసిందే. ఇవి కూడా డిజాస్టర్స్గా మిగిలాయి. జూలై నెల మొత్తం వరుస ఫ్లాపులతో నిండి పోయింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమనే కాకుండా ప్రేక్షకులు సైతం ఆగస్టుపై ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టులో సీతా రామం, బింబిసార, మాచెర్ల నియోజకవర్గం, కార్తీకేయ 2, లైగర్, ఏజెంట్ వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.