ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప ది రూల్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న `పుష్ప ది రైజ్`కు పార్ట్ 2గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. అయితే తాజాగా బన్నీ టాలీవుడ్కు ఓ స్టార్ డైరెక్టర్తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు.. హరీష్ శంకర్. అల్రెడీ బన్నీ, హరీష్ కాంబోలో `దువ్వాడ జగన్నాధం(డిజె)` మూవీ వచ్చింది.
2017లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ హిట్ కాంబో ఇప్పుడు మళ్లీ రిపీట్ కాబోతోంది. ఈ విషయాన్ని హరీష్ శంకర్ స్వయంగా స్పష్టం చేశారు. ఆస్ట్రల్ పైప్స్ సంస్థకి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాడ్ షూట్ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ యాడ్ విడుదల సందర్భంగా హరీష్ శంకర్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తో మూవీ ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించగా.. త్వరలోనే ఉంటుంది అని హరీష్ శంకర్ బదులిచ్చారు. తప్పకుండా తామిద్దరం కలిసి సినిమా చేస్తామని హరీష్ తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!