ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైస్`. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తే.. సునీల్, ఫహాద్ ఫాజిల్ విలన్లు నటించారు. అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేష్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. కేవలం హిందీ డబ్బింగ్ వర్షన్తోనే బాలీవుడ్లో వంద కోట్ల రేంజ్లో గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇకపోతే ఇప్పుడు ఈ మూవీకి `పుష్ప ది రూల్` టైటిల్తో పార్ట్ 2 రాబోతోన్న సంగగతి తెలిసిందే.
వాస్తవానికి సెకెండ్ పార్ట్ ఫిబ్రవరి నుండే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కానీ, మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకున్న సుకుమార్.. రెండు భాగాన్ని నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఆగస్టు నుండీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంది.. `పుష్ప 2`కు బన్నీ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2కు బన్నీ తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేశాడట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. `పుష్ప 2`కు బన్నీ రూ. 90 కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. మరి ఇది ఎంత నిజమో తెలియదు గానీ.. ఈ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది.