Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` పేరుతో గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ అదిరిపోయే కలెక్షన్స్ను రాబట్టి దుమ్ము దులిపేసింది.
దీంతో `పుష్ప 2`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ కాగా.. ఫహాద్ ఫాజిల్ విలన్గా అలరించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నిర్మితం కానున్న ఈ చిత్రం ఫిబ్రవరిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. సుకుమార్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను ఒక్కసారిగా మార్చేశాయి. దీంతో వారి అంచనాలను అందుకోవడం కోసం సుకుమార్ కథ, స్క్రిప్ట్పై మళ్లీ కసరత్తులు చేయడం ప్రారంభించారు. దీంతో సినిమా చెప్పిన సమయానికి సెట్స్ మీదకు వెళ్లలేదు.
మరోవైపు బన్నీ తన మేకోవర్ మార్చుకోకుండా `పుష్ప 2` కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అనుకున్న సమయానికి ఈ సినిమా షూటింగ్ పనులను స్టార్ట్ చేసి ఉంటే వచ్చే ఏడాది అల్లు అర్జున్ మరికొన్ని ప్రాజెక్టులకు పట్టాలెక్కించేవాడు. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు లేకుండా పోవడంతో.. బన్నీ కొత్త ప్రాజెక్ట్లను గ్రీన్ సిగ్నెల్ ఇవ్వలేక ఎంతో నష్టపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ చేతిలో బన్నీ అడ్డంగా ఇరుక్కున్నాడంటూ పలువురు సినీ ప్రియులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.