మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం `సీతారామం`. ఇందులో రష్మిక మందన్నా కీలక పాత్రను పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.
సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక, గౌతమ్ మీనన్ తదితరులు ఇతకర ముఖ్య పాత్రల్లో మెరిశారు. దేశభక్తి, ప్రేమ అంశాల నేపథ్యంలో ఓ అద్భుతమైన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇందులో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్, సీతగా మృణాల్ విశేషంగా ఆకట్టుకున్నారు.
సినిమాలో అనేక పాత్రలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పాత్రని దర్శకుడు హను చక్కగా మలిచి ప్రశంసలు అందుకున్నాడు. సినిమాల్లో వచ్చే ట్విస్ట్ లు కూడా ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మొత్తానికి పాజిటివ్ టాక్తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇకపోతే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ క్రేజీ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం.. `సీతారామం` అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్నూ ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుందట. అయితే స్ట్రీమింగ్ మాత్రం థియేటర్స్లోకి వచ్చిన ఆరు వారాల తర్వాతే చేయలని మేకర్స్ డీల్ కుదుర్చుకున్నారట. అంటే ఈ సినిమా సెప్టెంబర్ ఆఖరిలో లేదా అక్టోబర్ ఆరంభంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.