యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రమిది. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
యువ సుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్స్పై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణలు కలిసి ఈ సినిమాను హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీ ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. అయితే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీలో హీరోయిన్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పటికే అలియా భట్, సమంత, పూజా హెగ్డే, రష్మిక, జాన్వీ కపూర్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఎవరినీ ఎంపిక చేయలేదు.
అయితే రీసెంట్గా బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే `ఎన్టీఆర్ 30`ను చేతులారా వదులుకుందట. అసలేమైందంటే.. కొరటాల ఎన్టీఆర్కు జోడీగా అనన్య పాండేను తీసుకోవాలని ఆమెను సంప్రదించారట. కానీ, ఆమె `లైగర్` సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయమని కోరిందట. కట్ చేస్తే.. భారీ అంచనాల నడుమ విడుదలైన `లైగర్` బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమాలో అనన్య నటనపై ట్రోల్స్ కూడా పడ్డాయి. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ఆమెని తీసుకోవడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఆమెకి బదులుగా మరో హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారట. దీంతో టైమ్ తీసుకుని అనవసరంగా `ఎన్టీఆర్ 30`ని వదులుకున్నానే అని అనన్య ఇప్పుడు ఫీల్ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది.