Unstoppable 2: బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాపబుల్” టాకీ షో ఓటిటి రంగంలో అనేక సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. షోలో బాలకృష్ణ యాంకరింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. షోకి వచ్చే అతిధులతో చెడు గుడు ఆడేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన కుర్ర హీరోలు వస్తే బాలయ్య ప్రశ్నలు వాళ్ళు ఇచ్చే సమాధానాలకు.. అద్భుత రీతిలో ఎంటర్టైన్మెంట్ పండుతుంది. మొదటి సీజన్ ఎలా అలరించిందో దానికి మించి సెకండ్ సీజన్ నీ బాలయ్య దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో షోకి మొదటి సీజన్ కి భిన్నంగా… పొలిటికల్ లీడర్స్ ని తీసుకురావడం విశేషం. రెండో సీజన్ ప్రారంభం ఎపిసోడ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ రావడం తెలిసిందే. చంద్రబాబు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ షోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోశయ్య గద్దెనెక్కారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం చేయడం జరిగింది. ఆయన హయాంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించడం జరిగింది. ఆ టైంలో సమైక్యాంధ్రప్రదేశ్ పార్టీ కూడా పెట్టారు. అయినా గాని విభజన జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలగా ఏర్పడిన తర్వాత రాజకీయంగా నలారి కిరణ్ కుమార్ రెడ్డి సైలెంట్ అయిపోయారు.
కాగా కొత్త పార్టీ పెట్టడం ఆ తర్వాత సైలెంట్ కావడం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి… బాలయ్య షోకి మరి కొద్ది రోజుల్లో రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి మరియు బాలయ్య మధ్య స్నేహం ఎప్పటినుండో ఉంది. ఇద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు. అప్పటినుంచి ఇద్దరు మంచి మిత్రులు. ఈ క్రమంలో తన షోలోకి వచ్చే స్నేహితుడిని బాలకృష్ణ ఏ విధంగా ప్రశ్నలు వేస్తారో అన్నది ఆసక్తికారంగా మారింది.