Veera Simha Reddy: నటసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “వీరసింహరెడ్డి” సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒక సాంగ్ మినహా మిగతా పార్ట్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది అంట. త్వరలోనే ఈ సాంగ్ కూడా కంప్లీట్ చేయనున్నారట. ఇంకా ఇదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కావడం జరిగాయట. డిసెంబర్ మూడో వారం నుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలకృష్ణని చాలా పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తున్నారు.
బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన గ్లింప్స్ వీడియో…సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “జై బాలయ్య” సాంగ్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. టాలీవుడ్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒక్క పరాజయం కూడా లేదు. పైగా బాలకృష్ణ ఫ్యాన్ కావడంతో “వీరసింహారెడ్డి” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా టైటిల్ ప్రకటన ఫంక్షన్ కార్యక్రమంలో కర్నూల్ నడిబొడ్డులో సమరసింహారెడ్డి సినిమాకి 200 రెట్లు ఉంటుందని చెప్పటంతో.. అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
పైగా సంక్రాంతి సీజన్ బాలకృష్ణకి కలిసొచ్చే..సీజన్ నేపథ్యంలో ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పైగా ఇదే టైంలో చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ఒకరోజు గ్యాప్ లో రిలీజ్ అవుతువుండటంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతికి చిరు వర్సెస్ బాలయ్య ఫైట్ ఏర్పడింది. చాలాకాలం తర్వాత వీరిద్దరి సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటంతో…ఎవరు పైచేయి సాదిస్తారు అన్నది ఆసక్తికారంగా మారింది.