అనుపమ పరమేశ్వరన్.. తర్వలోనే ఈ ముద్దుగుమ్మ `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్, అనుపమ జంటగా నటించారు.బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలను పోషించారు. `కార్తికేయ`కు సీక్వెల్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. అనేక వాయిదా అనంతరం ఆగస్టు 12న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ఆ హీరోతో ఒక్కసారైనా నటించాలి.. అనుపమ కోరిక తీరేనా?
ఇక కార్తికేయ 2 ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ అనుపమ ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమెపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంలో అనుపమ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. రాత్రి పగలు షూటింగ్స్తో బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్స్లో పాల్గొనలేకపోతున్నా అంటూ ఆమె స్పష్టం చేసింది.
`అందరికీ నేను ఓ విషయంలో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇతర చిత్రాల షూటింగ్స్ లో నేను బిజీగా ఉన్నాను. రాత్రి పగలు తీరిక లేకుండా షూటింగ్స్ చేస్తున్నాను. ఈ కారణంగా నేను కార్తికేయ 2 ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోతున్నాను. పైగా కార్తికేయ2 రిలీజ్ డేట్స్ మారుతూ వచ్చింది. దాంతో ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్స్ లో పాల్గొనడం కష్టంగా మారింది. నా ఇబ్బంది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. కార్తికేయ 2 యూనిట్ కి ఆల్ ది బెస్ట్.` అంటూ తెలిపుతూ ఇన్స్టాలో ఓ పోస్ట్ వదిలింది. దీంతో ఆ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.