టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం `కార్తికేయ 2`. చందు మొండేటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.
ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అనేక వాయిదాల అనంతరం ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చేసి లాభాల భాట పట్టిన ఈ చిత్రం.. నార్త్ లోనూ అదరగొట్టేస్తోంది.
అయితే ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధించినా.. అనుపమ మాత్రం బాధగానే ఉందట. అందుకు కారణం ఏంటో కూడా ఆమె వివరించింది. తాజాగా చిత్రటీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అనుపమ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `కార్తికేయ 2 విడుదలైన దగ్గర నుంచి సినిమా హిట్ అయింది కదా .. నువ్వెందుకు సంతోషంగా లేవని నిఖిల్ తో సహా నా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు.
సినిమా హిట్ అయిందన్న ఆనందం కంటే.. ఈ జర్నీ అప్పుడే అయిపోయిందన్న బాధనే నాకు ఎక్కువగా ఉంది. ఆ బాధవల్లనే నేను ఈ హిట్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు .. నన్ను భరించినందుకు దర్మక నిర్మాతలకు, మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు` అంటూ అనుపమ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!