`ఇస్మార్ట్ శంకర్` తో మంచి కంబ్యాక్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్.. మరో రెండు రోజుల్లో `లైగర్`తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇందులో జంటగా నటించారు.
బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్ తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు. ఆగస్టు 25న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో గ్రాండ్గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి `లైగర్` మూవీకి విషెస్ తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్కు కొత్త పేరు కూడా పెట్టేసింది. ఇంతకీ ఆ పేరేంటో తెలుసా.. `జగ్గు దాదా`. తాజాగా అనుష్క తన ఇన్స్టాగ్రామ్లో `జగ్గు దాదా, ఛార్మీ, విజయ్ దేవరకొండ, అనన్య పాండే.. మరియు టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు. లైగర్ కోసం నేనెంతో అతృతగా ఎదురు చూస్తున్నా` అని పేర్కొంటూ లైగర్ మూవీ పోస్టర్ను షేర్ చేసింది.
దీంతో ఆమె పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు, ఆమె పూరి జగన్నాథ్కు పెట్టిన కొత్త పేరు కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది. కాగా, పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `సూపర్` మూవీతోనే అనుష్క టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదను దక్కించుకుంది. ఈమె అసలు పేరు స్వీట్ శెట్టి అయితే.. పూరీనే అనుష్కగా మార్చారు.
https://www.instagram.com/p/ChjjaIZvJk4/?utm_source=ig_web_copy_link