పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె(వర్కింగ్ టైటిల్)` ఒకటి. `మహానటి` దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దిశా పటాని కీలక పాత్రలను పోషిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. అయితే తాజాగా ఈ మూవీపై నిర్మాత అశ్వినీ దత్ అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. తాజాగా మీడియాతో సమావేశం అయిన ఆయన.. `ప్రాజెక్ట్ కె` హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్లో తెరకెక్కిస్తున్నామని, దీనికి సీక్వెల్ కూడా ఉండొచ్చని పేర్కొన్నారు.
డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని..పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కొంత టైమ్ పడుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 18, 2023న విడుదల చేయాలని భావిస్తున్నట్టు కూడా అశ్వినీ దత్ తెలిపారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయలేని పక్షంలో 2024 సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందట.
మరి ఈ రెండు తేదీల్లో ప్రభాస్ ఎప్పుడు వస్తాడో చూడాలి. మొత్తానికి పలు ఇంట్రస్టింగ్ విషయాలతో అశ్వినీ దత్ `ప్రాజెక్ట్-కె`పై ఉన్న అంచనాలను భారీ స్థాయిలో తీసుకెళ్లారు. ఇకపోతే ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కాకుండా పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల కానుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!