SSMB 28: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్ లలో ఒకటి త్రివిక్రమ్- మహేష్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, కలేజా రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతడు లో ప్రొఫెషనల్ కిల్లర్ గా, కలేజా లో చాలా పంచ్ డైలాగులు వేసే.. టాక్సీ డ్రైవర్ గా… రెండు సినిమాలను డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రని మహేష్ తో త్రివిక్రమ్ చేయించాడు. అయితే ఇప్పటికీ టెలివిజన్ రంగంలో ఆల్టైమ్ సినిమా ఏదైనా ఉంది అంటే అతడు అని చెప్పవచ్చు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కారణం చూస్తే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నా కానీ “అతడు” కి.. టెలివిజన్ రంగంలో ఇప్పటికీ టిఆర్పి రేటింగులు వస్తూ ఉంటాయి. వరస ఫ్లాపుల్లో ఉన్న మహేష్ అతడు సినిమా తో తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒకవేళ గనుక మహేష్ పోకిరి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అతడు చేసి ఉంటే.. “పోకిరి” ని మించిపోయే రికార్డులు.. “అతడు” క్రియేట్ చేసి ఉండేదని మహేష్ ఫ్యాన్స్ అంటుంటారు. ఇదంతా పక్కన పెడితే అతడు లో మహేష్ పొలం ఫైట్ చాలా హైలెట్. త్రివిక్రమ్ టేకింగ్.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. మహేష్ మాట్లాడకుండా చేసే యాక్షన్ ఫైట్ .. థియేటర్ ని దద్దరిల్లి పోయినట్టు చేయడం జరిగింది. అప్పట్లో పొలం ఫైట్ చూడటానికి.. థియేటర్ కి రిపీట్ ఆడియన్స్ వచ్చేవాళ్ళు.
ఇదిలా ఉంటే ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. “SSMB28” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాలో “అతడు” లో పొలం ఫైట్ మాదిరిగా… ఇంటర్వెల్ బ్యాంగ్ లో.. భారీ యాక్షన్ సీన్ త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా… ప్రొఫెషనల్ ఫైటర్స్ తో చేయించునున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ విదేశీ పర్యటన తర్వాత ఇటీవలే హైదరాబాద్ కి చేరుకున్నారు. జులాయి స్టార్టింగ్ నుండి త్రివిక్రమ్.. సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దాదాపు వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా వస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.