నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్బీకె 107` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇప్పటికే ఎనబై శాతానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. మరి కొద్ది రోజుల్లోనే మిగతా భాగాన్ని సైతం పూర్తి చేయబోతున్నారు.
ఇకపోతే ఈ మూవీకి తాజాగా మేకర్స్ టైటిల్ ను లాక్ చేశారు. గత కొద్ది రోజుల నుంచి `రెడ్డి గారు`, ` వీర నరసింహారెడ్డి` టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో రెడ్డిగారు టైటిట్ ను ఫైనల్ చేసినట్టు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
అంతేకాదు అక్టోబర్ 15న టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఇదే నిజమైతే బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవడం ఖాయం. కాగా, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
https://newsorbit.com/entertainment-news/balakrishna-nbk-107-movie-in-reshoot-mode.html
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!