`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా బ్రేకులు వేయలేని విధంగా స్పీడు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈయన గోపీచింద్ మలినేనితో తన 107వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు `వీరసింహారెడ్డి` అనే టైటిల్ను లాక్ చేశారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బాలయ్య తన 108వ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది.
అయితే ఇప్పుడు `ఎన్బీకే 109`కు కూడా దర్శకుడిని ఫైనల్ చేశారు బాలయ్య. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మహేష్ బాబు మంచి హిట్ అందించిన పరశురామ్. ఈయనతో బాలయ్య తన 109వ చిత్రాన్ని చేయబోతోన్నాడు. ఈ విషయాన్ని బాలయ్య పరోక్షంగా చెప్పేశారు. అల్లు అరవింద్ వీరి కాంబో చిత్రాన్ని నిర్మించబోతున్నారట.
అసలేమైందంటే.. `ఊర్వశివో.. రాక్షసివో` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా హాజరు అయిన బాలకృష్ణను అల్లు శిరీష్ `మీ తదుపరి చిత్రంలో నటించే అవకాశం ఇస్తారా? మీ పక్కన నుంచి డైలాగ్ చెప్పే సీన్ ఉంటే చాలు`అని అడిగాడు. అందుకు బాలయ్య `నెక్ట్స్ పరశురామ్ సినిమాలో ట్రై చేద్దాం. క్యారెక్టర్ ఏంటనేది సిట్టింగ్లో ప్లాన్ చేద్దాం` అంటూ సమాధానం ఇచ్చారు. దీనిని బట్టి బాలయ్య తదుపరి చిత్రం పరశురామ్తో ఉంటుందని తెలుస్తోంది.