Balakrishna: ఇండస్ట్రీలో ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు కలిగిన స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. హీరోగా రాణిస్తూ వ్యాపార రంగంలో కూడా బాగా క్లిక్ అయిన హీరో నాగార్జున..అని అంటారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో మహేష్ బాబు, అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ రంగంలో రాణిస్తున్నారు. అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. AMB’s పేరిట మహేష్ హైదరాబాద్ లో కొద్ది సంవత్సరాల క్రితం నుండి విజయవంతంగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే రంగంలోకి నరసింహం నందమూరి బాలయ్య బాబు ఎంట్రీ ఇచ్చారు.
విషయంలోకి వెళ్తే 1978లో ప్రారంభించిన తారకరామా థియేటర్ ని బాలకృష్ణ మళ్లీ పున ప్రారంభించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ థియేటర్ సంస్థలతో కలిసి ‘ఏషియన్ తారకరామా’ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. హైదరాబాద్ కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న ఈ థియేటర్ ఉంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా థియేటర్ లు తమకు దేవాలయంతో సమానమని తెలియజేశారు. అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా ఈ థియేటర్ నీ నిర్మించినట్లు తెలిపారు. 1978లో స్టార్ట్ చేసిన ఈ థియేటర్ లో ఫస్ట్ “సలీం అనార్కలి” సినిమా ప్రదర్శించబడింది అని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల థియేటర్ మూత పడింది.ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ఫోర్ కే ప్రొడక్షన్ మరియు సుపీరియర్ సౌండ్ సిస్టంతో థియేటర్ మళ్లీ పున ప్రారంభించామని స్పష్టం చేశారు. ఈ థియేటర్ తనకి వ్యక్తిగతంగా సెంటిమెంట్ అని తన సినిమాలు ఇక్కడ ఘన విజయాలు సాధించాయని స్పష్టం చేశారు.
తన కుమారుడు మోక్షజ్ఞ తారకరామ తేజ నామకరణం అని కూడా తన తండ్రి తారక రామారావు ఇక్కడే పెట్టారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 900కు పైగా సిట్టింగ్ కెపాసిటీ కలిగిన ఈ థియేటర్ ని 590కి తగ్గించి లోపల ఇంటీరియర్ డిజైనింగ్ కి పెద్దపీట వేసి.. అద్భుతమైన సిట్టింగ్ సోఫాలు.. సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ నెల 16వ తేదీన విడుదల కాబోతున్న “అవతార్ 2″తో ఈ దియేటర్ రీఓపెనింగ్ కానుంది. ఇంకా సంక్రాంతి కానుకగా బాలయ్య సినిమా “వీరసింహారెడ్డి” సైతం ఈ థియేటర్ లో విడుదల కానుంది. మల్టీప్లెక్స్ థియేటర్ గా ఈ థియేటర్ రాబోయే రోజులలో ఏ మేరకు లాభాలు తెచ్చి పెడుతుందో చూడాలి.