`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో పట్టాలెక్కించాడు. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా నటిస్తుంటే.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా పూర్తైన వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్నాడు. `ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్తో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా అనౌన్స్ చేశారు. తండ్రి-కూతురు మధ్య నడిచే కథ అని.. కాస్త వయసుమళ్లిన తండ్రిగా బాలయ్య, కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించనున్నారని అనిల్ రావిపూడి ఇప్పటికే స్పష్టం చేశాడు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంపిక చేశారని తాజాగా ఓ టాక్ బటయకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై బాలయ్య ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. `ఎన్బీకే 108`లో సోనాక్షి హీరోయిన్గా వద్దంటూ బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బలమైన సినిమా బ్యాక్గ్రైండ్ కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన సోనాక్షి.. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కరకాలమవుతోంది. ఈ పన్నెండు ఏళ్లలో ఆమె హిందీ సినిమాలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. సౌత్లో అడపా తడపా సినిమాలు చేసినా.. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. పైగా బాలయ్య జోడీగా ఆమె అస్సలు సూట్ అవ్వదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ సోనాక్షిని హీరోయిన్ గా ఎంపిక చేయకపోతే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!