Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే టర్కీ బయలుదేరబోతున్నారట. అక్కడే కొద్ది రోజులు మఖాం కూడా వేయబోతున్నారట. అయితే ఈయన టర్నీ టూర్ వ్యక్తిగత పనిపై కాదులేండీ. వృత్తిపరంగానే వెళ్లబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం బాలయ్య `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
`ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ యాక్షన్ ఎంటన్టైనర్లో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషిస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో అలరించబోతోఉన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన భాగాన్ని సైతం శరవేగంగా పూర్తి చేస్తుండగా.. బాలయ్య కరోనా సోకింది. దీంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు బాలయ్య కరోనా నుండి కోలుకోవడంతో.. మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్కు సన్నాహాలు చేస్తున్నారు. టర్కీలో `ఎన్బీకే 107` తదుపరి షెడ్యూల్ ఉండబోతోంది.
వాస్తవానికి ఈ షెడ్యూల్ను మొదట యూఎస్లో ప్లాన్ చేశారు. కానీ వీసా సమస్యల కారణంగా.. మేకర్స్ ఇప్పుడా షెడ్యూల్ను టర్నీకి మార్చారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే చిత్రబృందం టర్కీకి వెళ్లి లొకేషన్స్ ను సైతం ఫైనల్ చేసుకొని వచ్చిందట. ఈ నేపథ్యంలోనే బాలయ్య టర్కీకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.