నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఇది 107వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో ఓ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది.
కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా చేస్తుంటే.. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్రలను పోషిస్తోంది. ప్రస్తుతం చిత్ర టీమ్ టర్కీలో కొత్త షెడ్యూల్తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఈ సినిమాకు పని చేస్తున్న ఫోటోగ్రఫీ డైరెక్టర్ రిషి పంజాబీ బాలకృష్ణతో కలిసి విక్టరీ సింబర్ చూపిస్తూ ఫొటో దిగారు.
అపై అందుకు సంబంధించిన పిక్ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన రిషి పంజాబీ.. `లైటర్ ముమెంట్స్ విత్ లెజెండ్` అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దాంతో ఆయన పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే.. ఆ పిక్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా నందమూరి అభిమానులు బాలయ్య లేటెస్ట్ పిక్ను చూసి తెగ మురిసిపోతున్నారు.
`బాలయ్య రాక్స్, ఫ్యాన్స్ షేక్స్`, `లెజెండ్`, `ఫైర్`.. అంటూ రకరకాల కామెంట్స్తో చాట్ బాక్స్ను నింపేస్తున్నారు. మొత్తానికి బాలయ్య తాజా లుక్ మాత్రం అభిమానులనే కాదు నెటిజన్లు సైతం ఆకట్టుకుంటోంది. కాగా, `ఎన్బీకే 107` అనంతరం బాలయ్య అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను కూడా ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేశారు.
Lighter moments with the #legend #NandamuriBalakrishna sir #NBK pic.twitter.com/BxUpQOHyE0
— Rishi Punjabi (@RishiPunjabi5) August 28, 2022