`అఖండ` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107 చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా చేస్తుంటే.. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో బాలయ్య మరో హిట్ను ఖాతాలో వేసుకోవాలని ఆరాటపడుతున్నారు.
ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ నెల 21న టైటిల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. ఇకపోతే శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతోందని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం విధితమే.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం..ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7 వ లేదా జనవరి 12 వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఈ రెండు తేదీల్లోనే `ఎన్బీకే 107` రిలీజ్ డేట్ లాక్ అవ్వడం పక్కా అని టాక్ వినిపిస్తోంది.