నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ ప్రాజెక్డ్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `వీరసింహారెడ్డి` అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తున్నాడు.
అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ కన్ఫామ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి ఈపాటికే షూటింగ్ పూర్తి చేసి ఉండాల్సింది. కానీ, పూర్తి కాలేదు. ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ కూడా కరెక్ట్ గానే జరిగాయి. కానీ ఫైనల్ షెడ్యూల్ కు మాత్రం వరుస బ్రేకులు పడుతున్నాయి. ఫైనల్ షెడ్యూల్ కోసం సెప్టెంబర్ లో కొన్ని, అక్టోబర్ లో మరికొన్ని కాల్షీట్స్ ఇచ్చారు బాలయ్య. కానీ, అదే సమయంలో `అన్ స్టాపబుల్` షూటింగ్ తో పాటు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ కమర్షియల్ యాడ్ షూటింగ్లో బాలయ్య పాల్గొనవాల్సి వచ్చింది.
దీంతో `వీరసింహారెడ్డి` షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే మరో మూడు, నాలుగు రోజుల్లో షూటింగ్ను రీస్టార్ట్ చేసి ఫైనల్ షెడ్యూల్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిపి.. వెంటనే ప్రమోషన్స్ షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
https://newsorbit.com/entertainment-news/balakrishna-take-a-risk-for-veera-simha-reddy-movie.html