నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా చేస్తుంటే.. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. బ్యాలెన్స్ షూటింగ్ను సైతం త్వరత్వరగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను దింపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా టైటిల్పై ఎప్పటి నుంచో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ సస్పెన్స్కు చెక్ పెట్టేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 21 సినిమా టైటిల్ను ప్రకటించనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజుపై సినిమా టైటిల్ను విడుదల చేయనున్నారు.
ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు `రెడ్డి గారు`, `అన్నగారు` వంటి టైటిల్స్ వినిపించాయి. కానీ, ఫైనల్గా ఈ సినిమాకు `వీర సింహారెడ్డి` అనే టైటిల్ను లాక్ చేశారట. బాలయ్య సైతం ఈ టైటిల్ బాగా నచ్చిందట. రేపు అధికారికంగా ప్రకటించబోయే టైటిల్ ఇదే అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.