నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఇందులో విలన్గా చేస్తుంటే.. వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో అలరించబోతోంది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితం కానున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమా అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్తో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు.
టర్కీ బయలుదేరబోతున్న బాలయ్య.. ఎందుకోసమో తెలుసా?
తండ్రి-కూతురు మధ్య నడిచే కథ ఇది. తండ్రిగా బాలయ్య, కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమాకు `బ్రో ఐ డోన్ట్ కేర్` అనే టైటిల్ను పరిశీలనలో ఉందని, దాదాపు అదే ఫైనల్ అవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బాలయ్యకు ఆ టైటిల్ నచ్చలేదట. రీసెంట్గా టైటిల్ విన్న బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఈ టైటిల్ రిజెక్ట్ చేశారట. టైటిల్ బాగానే ఉన్నా.. అందులో తెలుగుదనం లేకపోవడంతో అనిల్ను మరో టైటిల్ను పరిశీలించాలంటూ బాలయ్య సూచించారట. మరి ఇప్పుడు అనిల్ ఏం చేస్తాడు..? అన్నది ఆసక్తికరంగా మారగా.. బాలయ్య సూచించినట్లే ఆయన వేరొక టైటిల్ పెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
శ్రీలంక సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు – మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరులకు ట్రావెల్ బ్యాన్