ఆరు పదుల వయసులో ఓవైపు హీరోగా, మరోవైపు హోస్ట్ గా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఇటీవల కమర్షియల్ యాడ్స్ లో నటించేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల కెరీర్లో బాలయ్య ఏ ఒక్క బ్రాండ్ కి కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది లేదు.
కానీ, కెరీర్లోనే తొలిసారి సాయి ప్రియా గ్రూప్ వెంచర్ అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్- 116 పారామౌంట్ కు బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. సాయి ప్రియా గ్రూప్ అనేది సౌత్ ఇండియాలోని కన్స్ట్రక్షన్ ప్లాటింగ్ సేవల సంస్థ. ఈ సంస్థను ప్రమోట్ చేస్తూ బాలయ్య రెండు యాడ్స్ చేశాడు.
ఈ రెండు యాడ్స్ ఇప్పటికే బయటకు వచ్చి.. మంచి రెస్పాన్స్ను దక్కించుకున్నాయి. ఈ యాడ్స్లో బాలయ్య లుక్స్ పరంగానే కాదు అదిరిపోయే డైలాగ్స్తో అదరగొట్టేశారు. అయితే ఈ యాడ్స్ కోసం బాలయ్య అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెతారు.
ఇంతకీ ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.15 కోట్లు. తన ఫస్ట్ యాడ్స్ ద్వారా బాలయ్య రూ. 15 కోట్లు అందుకున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బాలయ్య ఈ భారీ మొత్తాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పిటల్కు డోనేట్ చేశారట. దీంతో బాలయ్య గొప్ప మనసుకు నందమూరి అభిమానులే కాకుండా నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Proud First and on cloud nine already 🤩
Shreyas Media has always taken pride in marking milestones.
Here we add another feather to it by associating the God Of Masses #NandamuriBalaKrishna Garu and bringing him on board as a brand ambassador pic.twitter.com/2HOn3CCPKU— Shreyas Media (@shreyasgroup) October 28, 2022