నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే తొలిసారి యాడ్స్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి ఏ ఒక్క బ్రాండ్ కి కూడా బాలయ్య ప్రచార కర్తగా వ్యవహరించలేదు. అసలు ఆ వైపుకి తొంగి కూడా చూడలేదు.
కానీ, ఆయన మొదటి సారి కన్స్ట్రక్షన్ కంపనీ సాయి ప్రియ కన్ స్ట్రక్షన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో సాయిప్రియ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ కోసం త్వరలోనే ఓ యాడ్ ను రూపొందించబోతున్నారు. అందులో బాలయ్య కనిపించబోతున్నారు.
ఈ విషయాన్ని శ్రేయస్ మీడియా ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేసింది. అలాగే బాలయ్యకు కృతజ్ఞతలు కూడా తెలిపింది. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బాలయ్య బసవతారం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరియు నెటిజన్లు.. బాలయ్యది నిజంగా గొప్ప మనసు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.