లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకనిర్మాత విగ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. అయితే వీరి సరోగసి ఎంత పెద్ద వివాదంగా మారిందో తెలిసిందే.
నయనతార దంపతులు చిక్కుల్లో పడ్డారని.. వీరి సరోగసి చట్టబద్ధం కాదంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు చిక్కులన్నీ వీడాయి. అవును, నయన్ దంపతులకు బిగ్ రిలీఫ్ లభించింది. నయనతార సరోగసి పద్ధతిపై అన్ని వైపుల నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీ వేసిన విషయం విధితమే.
అయితే నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులకు కలిగిన కవల పిల్లలు చట్టబద్ధంగానే జన్మించారని తమిళనాడు విచారణ కమిటీ తాజాగా తేల్చి చెప్పింది. నయన్ దంపతులు ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు తమిళనాడు సర్కారుకు కమిటీ తన నివేదికను బుధవారం సమర్పించింది.
2016లోనే విఘ్నేష్ శివన్-నయనతార పెళ్లి చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ను ఆధారంగా చూపించారు. సరోగసి కోసం నయన్ దంపతులు 2021 ఆగస్టులో ప్రక్రియను మొదలుపెట్టారని, ఇక నిబంధనల మేరకు నవంబర్ లో వారు సరోగసి కోసం ఒప్పందం కూడా చేసుకున్నారని కమిటీ వెల్లడించింది. ఇక చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నయన్ దంపతులు సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చారట. మొత్తానికి అన్ని చిక్కులు వీడటంతో నయన్ దంపతులు ఫుల్ హ్యాపీ అయిపోయారు.