భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన అనంతరం ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత.. తన ఫోకస్ మొత్తాన్ని సినిమాల వైపే మల్లించింది. భాషలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతూ దూసుకుపోతోంది. అయితే ఇప్పటికే ఈమె `శాకుంతలం`, `యశోద` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసింది.
కానీ, ఈ చిత్రాలు విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. కనీసం ఈ సినిమాల ఎటువంటి అప్డేట్స్ కూడా రాకపోవడంతో.. అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే ఎట్టకేలకు సమంత అభిమానుల నిరీక్షణకు `యశోద` చిత్ర టీమ్ బ్రేక్ వేయబోతోంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టీం నుంచి ఓ ట్వీట్ వచ్చింది.
రేపు వినాయక చవితి సందర్భంగా `యశోద` నుంచి ఒక బిగ్ అప్డేట్ రాబోతోందంటూ ప్రకటించింది. దీంతో సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రేపు రాబోయే ఆ బిగ్ అప్డేట్ ఏంటా అని తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. కాగా, ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కావాల్సి ఉన్నా.. ఆ తేదీకి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. అయితే రేపు రాబోయే అప్డేట్ రిలీజ్ డేట్ అయిండొచ్చని అంటున్నారు.