నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం `బింబిసార`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాతో మల్లాడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అలాగే ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో సోషియో ఫ్యాంటసీ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలైంది.
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. టాక్ బాగుండటం, కటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను సాధిస్తూ దుమ్మ దులిపేస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ థియేర్స్లో సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.
ఇకపోతే `బింబిసార`కు సీక్వెల్ ఉంటుందని విడుదలకు ముందే మేకర్స్ ప్రకటించారు. సక్సెస్ మీట్ కూడా కళ్యాణ్ రామ్ `బింబిసార 2` ఉంటుందని బలంగా పేర్కొన్నారు. అయితే తాజాగా సీక్వెల్ పై నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునే నయా అప్డేట్ బయటకు వచ్చింది.
డైరెక్టర్ వశిష్ఠ్ అప్పుడే `బింబిసార 2` కథపైన కసరత్తులు మొదలు పెట్టాడట. ఈ ఏడాది చివరినాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని, ఆ తరువాత పనులను త్వరత్వరగా ఫినిష్ చేసి, వచ్చే వేసవిలో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేలా ఫ్లాన్ చేస్తున్నారట. ఇక 2024 ఆగస్టులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!