Bigg Boss 7: బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. ఇప్పటికే ఆరు సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. రెండు వారాల క్రితం ఆరో సీజన్ కంప్లీట్ అయింది. సింగర్ రేవంత్ టైటిల్ ట్రోఫీ గెలుచుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఆరో సీజన్ లో చాలా పాలిటిక్స్ జరగటంతో హోస్ట్ గా నాగార్జున బీబీ టీం పై సీరియస్ కావడంతోపాటు.. ఇదే తన లాస్ట్ సీజన్ అని కూడా చెప్పినట్లు టాక్. ఈ క్రమంలో ఆరో సీజన్ ఫినాలే రోజు నాగార్జున ప్రత్యేకమైన ఏవి కూడా బీబీ టీం ప్రదర్శించింది.
ఈ పరిణామంతో నెక్స్ట్ ఏడో సీజన్ కి ఎవరు హోస్ట్ గా ఉంటారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో చాలామంది ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రానా పేర్లు ఎక్కువగా వినబడాయి. అయితే తాజాగా మాత్రం మంచు విష్ణు పేరు గట్టిగా వినబడుతుంది. ఇప్పటికే బీబీ టీం విష్ణుని సంప్రదించినట్లు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరు సీజన్లలో మొదటి రెండు సీజన్ లు మినహా మిగతా నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా చేశారు. మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఈ రియాల్టీ షోకి రోజురోజుకీ పాపులారిటీ తగ్గుతూ ఉండటంతో పాటు సీజన్ 6 లో చోటు చేసుకున్న పరిణామాలు మరింత డ్యామేజ్ చేశాయి. ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకుల ఓటింగ్ పరంగా కాకుండా… కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడంతో తీవ్ర స్థాయిలో నెగిటివిటీ ఆడియన్స్ లో క్రియేట్ అయింది. దీంతో వాటన్నిటిని రిపేర్ చేసుకునే దిశగా..బీబీ టీం హోస్ట్ విషయంలో విష్ణుని సంప్రదించినట్లు.. సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.