నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రమే `బింబిసార`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హై బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ తద్వారా మల్లాడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఆగస్టు 5న వరల్డ్ వైడ్గా విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సాయంత్రానికి థియేటర్ల దగ్గర రద్దీ పెరిగింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను బద్దలు కొట్టి.. లాభాల బాట పట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతూ బీభీత్సం సృష్టిస్తోంది.
ఈ మూవీతో డైరెక్టర్ వశిష్ఠ్ అందరి చూపులను తనవైపుకు తిప్పుకున్నాడు. కొత్త దర్శకుడనే భావన లేకుండా సినిమాను చక్కగా ముందుకు నడిపించి వశిష్ఠ్ మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇక బింబిసారకు కొనసాగింపుగా బింబిసార 2 ఉంటుందని ఇప్పటికే హీరో కళ్యాణ్ రామ్ ప్రకటించాడు. కానీ, ఈ మూవీ ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.
ఈ గ్యాప్లో వశిష్ఠ్ మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దీంతో వశిష్ఠ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారగా.. ఓ ఇద్దరు హీరోల పేర్లు బలంగా వినిపిస్తున్నారు. ఆ హీరోలు మరెవరో కాదు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, నటసింహం నందమూరి బాలకృష్ణ అట. ఈ ఇద్దరు హీరోల్లోనే ఎవరో ఒకరితో వశిష్ఠ్ తన నెక్స్ట్ ను అనౌన్స్ చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.